నాగోలు ,జూలై 18 : ఎన్టీఆర్ నగర్ కు చెందిన పుష్ప (45),భర్త చనిపోవడం తో కూతురు (19) తో కలిసి ఉంటోంది. డిప్లోమో పూర్తి చేసిన ఆమె కూతురు పూజిత ఈ నెల 15 న కర్నూలు జిల్లాకు చెందిన పీర్బాబును సూర్యపేటలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వారం రోజుల క్రితం భర్తతో కలిసి ఇంటికి వచ్చింది. పుష్ప తల్లి కూతురికి పీర్బాబును వదిలేయాలని కోరింది అందుకు పూజిత నిరాకరించింది. దీంతో మనస్తాపానికి లోనైనా పుష్ప ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.