హైదరాబాద్, జూలై 18 : అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు భార్య నమ్రత తరచూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను పలకరిస్తుంటారు. తన కుటుంబ విశేషాలను, మహేష్ బాబు సినిమాలను, పిల్లలు గౌతమ్, సితార, ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా నమ్రత ‘5 సంవత్సరాల వైపు ఆమె (సితార)’ అని రాస్తూ, సితార పట్టు పరికిణిలో ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. జూలై 20న సితార 5వ పుట్టినరోజును జరుపుకోబోతోంది. దీన్ని గుర్తు చేస్తూ నమ్రత ఈ ఫొటోను పోస్ట్ చేశారు. సితార గులాబి రంగు పరికిణీ, జడకుచ్చులు, వడ్డాణంతో చాలా ముద్దుగా కనిపించింది. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. సితార చాలా అందంగా, క్యూట్గా ఉందని అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.