హైదరాబాద్, జూలై 18 : కుత్బుల్లాపూర్ లోని దత్తత్రేయగరలో నివసించే ఖబీరా బేగం (17) సుభాష్నగర్లోని ఓ ప్యాన్ల కంపనిలో పనిచేస్తోంది. షాపూర్నగర్ కళావాతినగర్ చెందిన ప్రదీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడున్నాడు. ఇందుకు ఖబీరా నో అనడంతో కక్ష పెంచుకున్నాడు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో యాసిడ్ బాటిల్ తో ఖబీరా ఇంటికి ప్రదీప్ వచ్చాడు. ఫోన్ చేసి ఏదో మాట్లాడాలంటూ బయటకి రమ్మన్నాడు. ఆమె బయటకి రాగానే తన వెంట తెచ్చిన యాసిడ్ ను ఖబీరాబేగం ముఖంపై చల్లి పారిపోయాడు. హైదరబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో రాత్రి ఘటన ఈ జరిగింది. స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40% కాలినగాయలైన భాధితురలిని సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకునేందుకు 4 బృందాలతో గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.