మిసిసిపి, జూలై 18 : కంటి పాపల కాపాడుకోవాల్సిన తండ్రే కాల యముడిగా మారాడు. నిండు నూరేళ్లు జీవించమని ఆశీర్వదించాల్సిన చేతులతో ఆ చిన్నారి ప్రాణం తీశాడు. తన కూతురు లెక్కలు సరిగ్గా చేయడం లేదని కర్కశంగా మూడేళ్ల చిన్నారిని చంపేశాడు. ఈ సంఘటన మిసిసిపిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. మిసిసిపికి చెందిన జోషువా అనే బాక్సర్కి బెయిలీ అనే మూడేళ్ల కూతురు ఉంది. పాపకి లెక్కలు నేర్పించాలన్న ఉద్దేశంతో రోజూ టార్చర్ పెడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని రాడ్డు విరిగేలా దారుణంగా కొట్టాడు. దీంతో ఆ పాప మెదడు, ఊపిరితిత్తుల నుండి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత అతనే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ప్రపంచంలో చదువు నేర్చుకోకపోతే తన కూతురు హాయిగా జీవించలేదని అందుకే తనకు లెక్కలు నేర్పించాలనుకున్నానని జోషువా విచారణలో తెలిపినట్లు సమాచారం.