బాలిక ఆత్మహత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

SMTV Desk 2017-07-18 10:36:18  girl,sucides,two,peroncs,arrested,registered,nirabaya,case,

మోత్కూరు,(తంగతుర్తి) జూలై 18 : మోత్కూరు మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన బాలిక (14) తో సమీపంలో పాలడుగు గ్రామానికి చెందిన కందికట్ల శ్రీహరికి వేసవికాలంలో పశువులు మేపే క్రమంలో స్నేహం ఏర్పడి ఆది ప్రేమగా మారింది. ఈ విషయం గ్రామంలో పలువురికి తెలుసు. బాలికకు శ్రీహరి తరచూ ఫోన్, మెసేజ్ లు చేయగా బాలిక ఫోన్ లేపలేదు దీంతో శ్రీహరికి బాలిక పశువులు మేపే సమయంలో వద్దకు చేరుకొని కోపం తో బాలికపై చేయిచేసుకున్నాడు. సమీపంలో ఉన్న దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన ఎలుగు శ్రీను వారి వద్ధకు చేరుకొని ఈ విషయాన్ని ఎక్కడా చెప్పవద్దని ఇరువురిని సముదాయించాడు. బాలిక ఇంటికి చేరుకొని అవమానాన్ని భరించలేక ఇంట్లో ఎవరూలేని సమయంలో స్లాట్ ఉక్కుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక ఆత్మహత్యపై ఇటీవల దత్తప్పగూడెం బాలిక కుటుంబంతో మరొక రికి ఘర్షణ జరిగింది. ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు విచరణ జరుగుతున్న సమయంలో బాలిక ఆత్మహత్య వెలుగులోకి వచ్చింది. బాలిక ఆత్మహత్యకు కందికట్ల శ్రీహరి, ఎలుగు శ్రీను కారణమని పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్‌ చేసి నిందుతులపై (324),( 305),(354),ఏ,డీ, రెడ్‌విత్త్‌ సెక్షన్లతోపాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.