క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రిపై కత్తితో దాడి

SMTV Desk 2017-07-18 09:36:28  indian,criketr,joginder,sharma,rohtak,

రోహ్‌తక్,జూలై 18: క్రికెటర్ జోగిందర్ శర్మ తండ్రి ఓం ప్రకాశ్ శర్మ పై రోహ్‌తక్‌లో దాడి చేశారు. శనివారం రాత్రి 68 ఏళ్ల ఓం ప్రకాశ్ రోహాతక్ కాథ్‌మండి సమీపంలో తన కిరాణం దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్‌డ్రింక్స్, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి తిరిగి వచ్చి ఓం ప్రకాష్ పై దాడి చేశారు. "వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారు దుకాణంలోని రూ. 7 వేల వరకు పట్టుకొని పోయారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో కడుపులో పొడిచారని" ప్రకాష్ తెలిపారు. దుండగులు, గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి బయట నుంచి మూసేసి వెళ్లిపోయారు. స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.బౌలర్‌ జోగిందర్ శర్మ, 2007 టీ 20 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ లో చివరి ఓవర్ వేసి భారత్ జుట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.