ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్తో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ఐదో టెస్టులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి.ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. జట్టులో సమతుల్యత లేకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు భావిస్తోంది. ఇంగ్లీషు గడ్డపై జరుగుతున్న టెస్టు సిరిస్ ఆరంభం నుంచీ భారత ఓపెనర్లు వరుసగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. పృథ్వీషాకు అవకాశం ఇవ్వాలని జట్టే మేనేజ్మెంట్ యోచిస్తోంది.