హైదరాబాద్: మీడియా సమావేశంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. బాబూమోహన్కు షాక్ ఇచ్చారు. నల్లాల ఓదేలు( చెన్నూరు), బాబూమోహన్(ఆందోల్)కు టికెట్లు నిరాకరించినట్టు ప్రకటించారు. మంచి రోజు పని ప్రారంభిస్తే అంతా మంచే జరుగుతుందన్న కేసీఆర్.. 105 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇటీవల ఆంధోల్ నియోజకవర్గం నుంచి బాబూమోహన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో టీఆర్ఎస్ కార్యకర్తలపై బాబూమోహన్ దురుసుగా ప్రవర్తించారు.