హుస్నాబాద్‌లో తెరాస బహిరంగ సభ

SMTV Desk 2018-09-04 18:24:03  TRS Party Massive Meeting, Husnabad, Harish Rao, Irrigation Minister

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల వాతారణం వేడెక్కుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెరాస బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ సందర్బంగా ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెరాస సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వారు ఈ సందర్బంగా మీడియా సమావేశంలో వివరించారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ పరిశీలించారు. బహిరంగ సభకు ‘‘ప్రజల ఆశీర్వాద సభ’’గా నామకరణం చేసినట్లు వారు తెలిపారు.