హైదరాబాద్: నాడు మన్మోహన్ సింగ్ మాటలను పట్టించుకోలేదని దానికి నిదర్శనమే ఇప్పుడు రూపాయి విలువ తగ్గుతుందని మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డిలు మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. పెట్రోలు, డీజిల్ ధరల పెరగుదలపై దేశవ్యాప్తంగా నిరసన వాక్తమవుతోందని అన్నారు. ద్రవ్యోల్భణం, పెట్రో ధరలపై కేసీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలో తేవాలని వారు డిమాండ్ చేసారు. వాటిపై వేసే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను రద్దచేయాలని కోరారు.పెరిగిన పెట్రో ధరలను నిరనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. . ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు మొక్కుతారు. ఇక్కడ నిలదీస్తానంటాడని విమర్శించారు.పెరిగిన పెట్రో ధరలను నిరనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని వారు ఈ సందర్బంగా పేర్కొన్నారు.