మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా లక్ష చీరలను పంపిణీ చేశారు. మూలపాడులో వసంత కృష్ణ ప్రసాద్ స్వయంగా పేదలకు చీరలను పంపిణీ చేశారు.