ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త

SMTV Desk 2018-09-02 10:56:06  KCR, Transco employees, Telangana CM

విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే విద్యుత్ ఉద్యోగులకు హెల్త్ స్కీం అమలు చేస్తామని తెలిపారు సీఎం కేసీఆర్. ఇవాళ (సెప్టెంబర్-1) ప్రగతి భవన్‌ లో విద్యుత్ ఉద్యోగులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం PRC(వేతన సవరణ) ప్రకటించారు. అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారని.. తెలంగాణ చీకటి అవుతుందని చెప్పిన వారే చీకట్లో కలిశారని చెప్పారు. వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడంలో విద్యుత్ ఉద్యోగులది కీలకపాత్ర అని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే బాలారిష్టాలు అధిగమించామన్న కేసీఆర్.. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తన వరకు వచ్చిన సమస్యలను గతంలోనే పరిష్కరించాను అని స్పష్టం చేశారు. కేసులు పరిష్కారం కాగానే మిగతా విద్యుత్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని తెలిపారు సీఎం. పరిశ్రమలతో పాటు రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. 24 గంటల కరెంటుతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్.