భద్రాద్రి :భార్యను చితకబాదిన ఎస్ఐ

SMTV Desk 2018-08-31 13:27:39  bhadradri, Manuguru SI, Illegal relationship

భద్రాద్రి జిల్లా మణుగూరు ఎస్ఐ వీరంగం చేశాడు. వివాహేతర సంబంధంపై నిలదీయడంతో ఎస్ఐ జితేందర్ భార్య, అత్తపై దాడిచేశాడు. ఎస్ఐ దాడిలో భార్య, అత్త తీవ్రంగా గాయపడ్డారు.భార్యతో పాటు ఆమె బంధువులపై దాడి చేసి రక్తం కారేలా కొట్టాడు. మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌ పాల్వంచకు చెందిన పర్వీన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు భార్య పర్వీన్‌కు తెలిసింది. ఇదే విషయంపై భార్య భర్తల మధ్య కొంత కాలంగా గొడవ జరుగుతోంది. దీంతో ఎస్‌ఐ జితేందర్‌ భార్యకు దూరంగా విడిగా ఉంటున్నాడు. ఇదే విషయంపై భర్తను నిలదీయడంతో భార్యభర్తల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పుట్టింటిలో ఉన్న పర్వీన్ నిన్న (గురువారం సాయంత్రం) ఇంటికి వచ్చింది. ఆ సమయంలో భర్తతో పాటు మరో మహిళ ఉండటాన్ని గమనించిన పర్వీన్ జితేందర్‌ను నిలదీసింది. దీంతో రెచ్చిపోయిన ఎస్ఐ జితేందర్‌ అతి దారుణంగా రక్తం వచ్చేలా చితకబాదాడు.