ఢిల్లీలో రాహుల్ ని కలిసిన కర్ణాటక సీఎం

SMTV Desk 2018-08-30 18:22:09  karnataka,kumaraswamy,rahulgamdhi,delhi,congress

జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి కర్ణాటక సీఎంగా నేటి తో 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు గా నిలవడంతో కుమారస్వామి సిఎం పదవికి పోటిగా నిలబడ్డారు.కుమారస్వామి తన వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీ వెళ్లి కలిశారు. రాహుల్ కు పుష్పగుచ్ఛం అందజేసిన కుమారస్వామి కృతఙ్ఞతలు తెలిపారు. కర్ణాటకలో మంత్రి వర్గ విస్తరణ విషయం వారి మధ్య చర్చనీయంసం జరిగినట్టు తెలుస్తుంది. కాగా, సంకీర్ణ ప్రభుత్వంలో తన కష్టాల గురించి మీడియా ముందు ఓసారి ఆయన కన్నీరు పెట్టిన విషయం తెలిసిందే.