భారత్, ఇంగ్లాండ్ మధ్య మరో కీలక సమరానికి వేళైంది. సౌథాంప్టన్లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. తొలి రెండు టెస్టులు గెలుచుకున్న ఇంగ్లండ్ మూడో టెస్టులో ఓడిపోగా, 1-2తో వెనుకబడిన భారత్ ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ ఫలితాన్ని ఐదో టెస్టుకు మార్చాలని ఉవ్విళ్లూరుతోంది. భారత్: శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్, పుజారా, కోహ్లీ, రహానె, పాండ్య, రిషబ్ పంత్, అశ్విన్, ఇషాంత్, షమి, బుమ్రా. ఇంగ్లాండ్: అలిస్టర్ కుక్, జెన్నింగ్స్, జో రూట్, బెయిర్స్టో, బెన్స్టోక్స్, బట్లర్, మొయిన్ అలీ, కరన్, రషీద్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్.