శిశువుతో సహా 4శవాలు హత్యా ..?ఆత్మహత్య ..?

SMTV Desk 2018-08-30 10:58:39  delhi,murder, family,police,case gurugram,deadbodys

న్యూఢిల్లీ శివార్లలో గురుగ్రామ్ సమీపంలోని బ్రిజ్ పురా గ్రామంలో ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మూడు మృతదేహాలు కనిపించడం కలకలం రేపింది. ఇంట్లో నేలపై పురుషుడు, స్త్రీ మృతదేహాలుండగా, మరో స్త్రీ మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. అక్కడే అపస్మారక స్థితిలో పడివున్న ఓ బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఓ మహిళ, తన అత్తను, భర్తను, బిడ్డను హతమార్చి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఈ హత్యలు తమ కుటంబ కలహాలే వల్లే జరిగివుండవచ్చని మహిళే ఈ హత్యలు చేసి తను ఉరివేసుకునే ఉండవచ్చని కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు