ప్రేమ విషయంలో ఉపాద్యాయుల ఒత్తిడి... విద్యార్ది ఆత్మహత్యాయత్నం

SMTV Desk 2018-08-29 19:33:14  tripura,shool teachers,lovers rakhi,agartha

ప్రేమించి ప్రియురాలితో రాఖీ కట్టించడానికి ఓ స్కూలు యాజమాన్యం ప్రయత్నంచేయగా ఆ యువకుడు బిల్డింగ్ పై నుంచి దూకేశాడు.దీంతో తీవ్రగాయాలయిన ఆ యువకుడి పరిస్థతి ప్రస్తుతం అష్పతిలో విషమం ఉంది ఈ సంఘటన త్రిపుర రాజధాని అగర్తలాలో చోటుచేసుకాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సదరు యువకుడు అదే స్కూల్ చదువుతున్నా దిలీప్ కుమార్. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం ఇద్దరి తల్లిదండ్రులను పిలిపించింది. పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లు వారిముందే యువతి చేత యువకుడికి రాఖీ కట్టించేందుకు యత్నించారు. కానీ దీనికి యువతీయువకులు నిరాకరించారు. అయినా పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేయడంతో మనస్తాపం చెందిన యువకుడు రెండో అంతస్తు పైకివెళ్లి కిందకు దూకేశాడు. ఈ నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం తీరును నిరసిస్తూ యువతీయువకుల తల్లిదండ్రులు, విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. ఈ ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.