ఆ లేఖలో... మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషుల కోసం..

SMTV Desk 2018-08-29 14:14:49  harikrishna, tollywood,nandamuri,kerala

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) నల్గొండ అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై కామినేని ఆస్పత్రి లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.దీంతో నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్ 2న హరికృష్ణ 62 వ జన్మదినం రానుంది ఇంతలోనే ఇలా తమకు దూరమవ్వడం అటు కుటుంబంలో ఇటు అభిమానుల్లో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘‘సెప్టెంబరు 2న అరవై రెండో పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్ట్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్ఛాలు, దండలు తీసుకురావద్దని వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను.. ఇట్లు- మీ నందమూరి హరిక‌ృష్ణ’’ అంటూ ఆయన ఆ మద్య అభిమానులకు,ఆత్మీయులకోసం ఓ లేఖను కూడా రాశారు.