కేసిఆర్ చేసిన సహాయానికి అభినందించాలి :సీపిఐ నేత నారాయణ

SMTV Desk 2018-08-28 16:56:18  telangana,kcr, narayna cpim,uae,bjp,keralafloods

వరదల్లో చిక్కుకున్న కేరళకు తమ పార్టీ తరుపున సీపీఐ సీనియర్ నేత నారాయణ కేరళ వరద బాధితుల కోసం సీపీఐ నేతలు, కార్యకర్తలు బియ్యం, సరుకులు, మందులు, బట్టలు, విరాళాలను సేకరించి వాటన్నిటిని ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపించారు. ఈ వాహనాలకు నారాయణ జెండా ఊపి సాగనంపారు. మరో పక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేరళకు అందించిన సాయాన్ని కొరకు కేసీఆర్ ను అభినందించాలని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు కేరళకు సాయం అందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేరళకు ఏమాత్రం సాయం చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. దీంతోపాటు యూఏఈ అందించాలనుకున్న భారీ సాయాన్నికూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం అత్యంత మూర్ఖత్వమని అయన తెలిపారు .