ద్యూతీ చంద్‌కు ఒడిశా ప్రభుత్వం కోటిన్నర నజరానా

SMTV Desk 2018-08-28 13:07:00  Dyuthi Chand, 1 crore gift, asian games

ఏషియాడ్ వంద మీటర్ల రేస్ లో సిల్వర్ మెడల్ గెల్చుకున్న రన్నర్ ద్యుతీ చంద్ పై ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. వంద మీటర్ల స్ర్పింట్ ఈవెంట్ ఫైనల్ లో రెండో స్థానంలో నిలిచి భారత్ కు రజత పతకం తెచ్చిపెట్టిన ద్యుతీకి.. కోటి రూపాయల యాభై లక్షల బహుమానం ఇస్తున్నట్టు ఒడిశా సీఎంఓ తెలిపింది.‘20 ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన తొలి పతకం ఇది. 1998లో కూడా ఒడిశా అథ్లెట్‌ రచితా పండా మిస్త్రీ కాంస్యం నెగ్గింది’ అని సీఎం పట్నాయక్‌ గుర్తుచేశారు.