చంద్రబాబును కలిసిన మాజీ డీజీపీ సాంబశివరావు

SMTV Desk 2018-08-28 10:45:53  Chandrababu, DGP sambashiva rao,

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాజీ డీజీపీ సాంబశివరావు మంగళవారం కలిశారు.విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను సాంబశివరావు ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సాంబశివరావు వైకాపాలో చేరనున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన సాంబశివరావు... సీఎం చంద్రబాబును కలిశారు. అయితే... వీరిద్దరి మధ్య జరిగిన చర్చల తాలూకూచ వివరాలు తెలియరాలేదు. మొన్న జగన్‌ను కలవడం, ఇప్పుడు చంద్రబాబును సాంబశివరావు కలవడం పట్ల పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.