ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారు : పురంధేశ్వరి

SMTV Desk 2018-08-27 20:52:02  purandeswari,bjp, haidarabad,narendramodi

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో మాజీ మంత్రి పురంధేశ్వరి సమక్షంలో వైఎస్సార్‌సీపీ నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి భాజపాలో చేరారు. నరేంద్రమోదీ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి నిబద్ధతో పని చేస్తానని ఆయన తెలిపారు.తాను రాజకీయ ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని చివరి శ్వాసవరకు భాజపా కండువాతోనే ఉంటానని చెప్పారు. గతంలో ఆయన కర్నూలు‌ జిల్లా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కేఈ కృష్ణమూర్తిపై ఓటమి చవిచూశారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పు కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆమె తెలిపారు.దానికితగ్గట్టుగానే ప్రధాని నరేంద్రమోదీగారు అవినీతిరహిత సుపరిపాలన అందిస్తున్నారన్నారు. భాజపా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు.కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న సహాయాన్నిభాజపా కార్యకర్తలే ప్రజల వద్దకు చేరవేయాలని పురంధేశ్వరి కోరారు.