మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా ‘నరసింహారెడ్డి’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. అక్కడికి వెళ్లి సందడి చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా సెట్లో చిరు, అమితాబ్ బచ్చన్, రామ్చరణ్తో కలిసి పవన్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే పవన్ తాజాగా సెట్కు వెళ్లారా, లేదా గతంలో జరిగిన షెడ్యూల్లో చిరును కలిశారా అనే విషయంపై స్పష్టత రాలేదు. దీంతో మెగాభిమానులు సంబరాలు చేసుకుంటారు.అయితే మెగా కుటుంబంలో మనస్పర్థలు అంటూ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ, తామంతా ఒకటే అంటూ పలుమార్లు చెప్పకనే చెప్పారు మెగా హీరోలు. ఒకరి ఫంక్షన్కు మరొకరు హాజరు అవ్వడమే కాదు.. ఒకరికి సమస్య వచ్చినప్పుడు మిగిలిన అందరూ వారికి అండగా నిలుస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో చిరు గురువు పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. 2019లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.