కూతుళ్ల నే కాడెద్దులుగా మార్చుకున్న తండ్రి....

SMTV Desk 2017-07-17 13:18:04  famer,daghters,fincail,crisis,madyapradhesh

భోపాల్ ,జూలై 17 : మధ్యప్రదేశ్ బసంత్‌పూర్‌ గ్రామానికి చెందిన సర్దార్ కహ్లా కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. వారిది రెక్కాడితే కాని డోక్కారని పరిస్థితి సర్దార్ కహ్లా తన పొలం దున్నటానికి ఎద్దులు లేవు. వాటిని కొని పోషించే స్తోమత అంతకన్నా లేదు. దీంతో,కన్నతండ్రి తన ఇద్దరి కూతుళ్లని బడి మానిపించి వారినే పొలం దున్నటానికి ఉపయోగించుకున్నాడు. రాధిక, కుంతిల లను కడేద్దులుగా మార్చుకున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కూతుళ్ల చదువు అంతరాయం కలిగించానని కహ్లా డీఆర్‌డీఓ ఆశిశ్‌ శర్మ తో చెప్పాడు. డీఆర్ డీఓ ఆశిశ్ శర్మ రైతు దుస్థితి స్పందించి ఉన్నతాధికారుల దృస్టికి తీసుకెళ్తామని ప్రభుత్వం పథకాల కింద వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని మీ కూతుళ్లని అలా ఎద్దుల స్థానంలో ఉపయోగించల్సింది. కాదని రైతుతో ఆశిశ్ శర్మ అన్నారు.