ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5000 భృతి

SMTV Desk 2018-08-24 18:08:28  CM KCR, Muslims,

మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు రూ.5000 భృతి ఇవ్వాలనితెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి పెరిగిన భృతి చెల్లించనున్నట్లు వెల్లడించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మౌజమ్, ఇమామ్ లకు మొదట నెలకు వెయ్యి రూపాయల భృతి అందించారు. ఆ తర్వాత దాన్ని రూ.1500 కు పెంచారు. 2018 సెప్టెంబర్ 1 నుంచి ఆ భృతిని రూ.5వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్రంలోని మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే దాదాపు 9000వేల మందికి ప్రభుత్వ నిర్ణయం వల్ల మేలు కలుగుతుందని సీఎం అన్నారు.