హైదరాబాద్, జూలై 17 : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం సుల్తాన్పూర్ సమీపంలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ లారీ అదుపు తప్పి సర్వీస్ రోడ్డుపై పడింది. వివరాలలోకి వెళితే.. నాగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు ఫౌల్ట్రీ ఫాం కు మేత తీసుకెళ్తున్న లారీ, సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ బ్రిడ్జి వద్దకు రాగానే ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొని కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగేశ్వర్ రావు, క్లీనర్ కిష్టయ్య క్యాబిన్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని డ్రైవర్ ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. క్లీనర్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో ఆ లారీ భాగాలను కట్టర్ల సాయంతో తొలగించి దాదాపు రెండు గంటలు కష్టపడి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.