మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

SMTV Desk 2018-07-29 20:31:13  janasena,pawankalyan haidarabad

సికింద్రాబాద్‌: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పట్టువస్త్రాలు,పసుపుకుంకుమలను పవన్ సమర్పించారు.ఆలయ అధికారులు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. పవన్ ను చూసేందుకు అభిమానులు,మరియు దర్శనానికి వచ్చిన భక్తులు తమ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.