చిత్తూరు, జూలై 16 :సినీ క్రిటిక్ కత్తి మహేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హిందువుల మనోభావాలు దేబ్బతేసే విధంగా శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనను పోలీసులు హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, చిత్తూరు జిల్లాలోని ఆయన సొంతూరులో తెలంగాణ పోలీసులు విడిచి పెట్టారు. ఈ రోజు ఆయన పీలేరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. అక్కడి పోలీసులు కత్తి మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పీలేరు నుంచి మదనపల్లెకు తరలించారు. అక్కడి నుంచి మహేశ్ను బెంగళూరుకు తరలించనున్నట్టు తెలుస్తోంది. శ్రీరాముడిపై కత్తి మహేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు చేసినందుకు గానూ యాదాద్రి వరకు పాదయాత్ర చేస్తానని పరిపూర్ణానంద స్వామి ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారిద్దరిని ఆరు నెలలపాటు నగరం నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు రెండు రోజుల క్రితం నగరాన్ని వదిలివెళ్లారు. అయితే ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న కత్తి మహేశ్.. శ్రీరామునిపై పాట పాడుతూ.. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు.