హైదరాబాద్, జూలై 12 : తెలుగు సినీ పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ ఉందంటూ నటి శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా నిరసనలు చేపట్టింది. అంతే కాకుండా సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి.. తాజాగా మరో దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్ పైనే విమర్శలు గుప్పించిన శ్రీరెడ్డి.. తాజాగా కోలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక తమిళ సినీ ఇండస్ట్రీ గుట్టురట్టు చేసే సమయం వచ్చిందని తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని మాటిచ్చి మోసం చేశారని ఆరోపించింది. "హాయ్ తమిళ్ డైరెక్టర్ మురుగదాస్ జీ.. ఎలా ఉన్నారు? మీకు గుర్తుందా వెలిగొండ శ్రీనివాస్ ద్వారా మనం గ్రీన్ పార్క్ హోటల్లో సమావేశమయ్యాం. మీ సినిమాల్లో నాకు అవకాశాలు ఇస్తానని ప్రామిస్ చేశారు. కానీ ఇంతవరకు మీరు నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మీరు కూడా గొప్పవారే సర్" అని పేర్కొన్నారు. మురుగదాస్ పై శ్రీరెడ్డి తన ఫేస్బుక్ పేజీలో పెట్టిన సంచలన పోస్ట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.