డ్రగ్స్ పై అనూహ్య నిర్ణయం .. అకున్ సబర్వాల్

SMTV Desk 2017-07-15 15:59:09  

హైదరాబాద్, జూలై 15 : తెలంగాణ రాష్ట్రాన్ని బుతంలా పట్టి పీడిస్తున్న డ్రగ్స్ కేసు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ కేసు తీవ్రత దృష్ట్యా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తన సెలవులను రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు సెలవులను వాయిదా వేసుకుంన్నట్లు ఆయన శనివారం ఉదయం ప్రకటించారు. ఇవాళ ఉదయం ఓ మీడియా ఛానెల్ తో ఫోన్ ఇన్ లో మాట్లాడుతూ.. తన సెలవులను వదంతులు వస్తున్న నేపథ్యంలోనే సెలవులు రద్దు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు డ్రగ్స్ రాకెట్ ముఠాపై ఉక్కుపాదం మోపనున్నామని ఆయన తెలిపారు. డ్రగ్స్ ను ప్రోత్సహించిన వారి పై కూడా కఠిన చర్యలు తప్పవని సబర్వాల్ స్పష్టం చేశారు. ఈ డ్రగ్స్ ను తొలగించి తెలంగాణను డ్రగ్స్హ్రిత రాష్ట్రంగా మారుస్తామని, అవసరమానుకుంటే పోలీస్ సాయం తీసుకుంటామని అన్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ పై సాగుతున్న దర్యాప్తులో ఆసక్తికర సమాచారం. ఈ డ్రగ్స్ చెలామని చేసేవారిపై ఎైక్సెజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక నిఘా పెట్టింది. 30 రోజులుగా కూపీ లాగుతూ, రాకెట్ మూలాలను ఛేదించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇప్పటివరకు ముఠాలోని 13 మందిని అరెస్టు చేసి వారి మొబైల్ కాల్‌డాటా ప్రకారం కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు. డ్రగ్స్ కేసులో పక్కా ఆధారాలతో ఇప్పటివరకు సినిమారంగానికి చెందిన 12 మందికి నోటీసులు పంపినట్లు, ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభమవుతుందని వెల్లడించారు. నోటీసులు అందుకున్నవారంతా రోజుకొక్కరు చొప్పున విచారణకు ఎైక్సెజ్ సిట్ ముందు హాజరుకావాలని తెలియజేశారు.