నా ఒక్కడికే అనుమతి ఇవ్వండి : పరిపూర్ణానంద

SMTV Desk 2018-07-09 18:35:35  Swami Paripoornananda, kathi mahesh, hyderabad

హైదరాబాద్, జూలై 9 : శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఒక్కడినే యాత్ర చేసేందుకైనా తనకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు. తన విజ్ఞప్తిని పట్టించుకోకపోతే యాత్ర ఎలా చేయాలో తెలుసని.. అప్పటికీ అడ్డగిస్తే ఆహారం తినకుండా నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్‌ పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. సోమవారం ఉదయాన్నే ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. పరిపూర్ణానంద స్వామి బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. స్వామికి మద్దతుగా జూబ్లీహిల్స్‌ చేరుకున్న ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.