హైదరాబాద్, జూలై 14 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు బుధవారం ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌంట్ ఒపేరాలోని 103 కాటేజ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా పేకాటాడుతూ పట్టుబడిన వారిని విడిపించడం కోసం ఓ యువ హీరో పోలీసులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. నిందితులు శాపపురం (తమిళం) సినిమా షూటింగ్ యూనిట్కు చెందిన వారిగా గుర్తుంచారు. పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.