హైదరాబాద్, జూన్ 30 : సినీ క్రిటిక్ కత్తి మహేష్పై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.చీటికి మాటికి రాజ్యాంగం తనకు స్వేచ్చా హక్కు ఇచ్చిదని చెప్పుకొంటూ ఈ సారి దేవుడి మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హిందూ జనశక్తి నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్ ఫోన్ లైన్ లో మాట్లాడుతూ.."రామాయణం అనేది నాకొక కథ. రాముడనే వాడు దగుల్బాజీ అని నేను నమ్ముతా.. ఆ కథలో సీత బహుశా రావుణుడితోనే ఉంటే బాగుండేదేమో, ఆవిడకి న్యాయం జరిగి ఉండేదేమో అని నేననుకుంటా" అంటూ రాముడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్యదైవం రాముడిపై కత్తి మహేశ్ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హిందూ జనశక్తి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.