ప్రేమ వివాహం.. బలవంతపు పెళ్లంటూ ఫిర్యాదు

SMTV Desk 2017-07-14 12:49:42  woman,commit,sucide,love,marrege,mandamarri,

మందమర్రి, (చెన్నూర్ ) జూలై 14 : మంచిర్యాల జిల్లా మందమర్రిలో క్యాతం శ్రీవాణి కుటుంబం నివసిస్తోంది. ఇటీవలే ఆమె సారంగపెల్లికి చెందిన అయిల్ల సాగర్ ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22 న సాగర్, శ్రీవాణి కాళేశ్వరంలో వివాహం చేసుకుని వస్తుండగా ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సాగర్ ను భయపెట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ బెల్లంపల్లి ఏసీపీకి శ్రీవాణి సోదరుడితో కలసి ఫిర్యాదు చేశారు. తను బలవంతగా పెళ్లి చేసుకోలేదని,పెళ్లి ఫొటోలే నిదర్శమంటూ శ్రీవాణితో దిగిన ఫొటోల్ని సాగర్‌ సోషల్‌మీడియాలో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి గురువారం నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత స్పృహ లోకి వచ్చిన శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ... "ఏసీపీకి చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారణ చేపట్టం లేదు. సాగర్ తోనే కాపురం చేయాలని, తన అన్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ ఏసీపీ బెదిరింపులకు పాల్పడ్డారు" అని తెలిపింది. "అమ్మ, అన్నయ్య అక్కలందరూ నేను చేసిన తప్పులకు క్షమించండి. ఇక భూమి మీద బతికే ఆశ నాకు లేదు. సాగర్, భీరెల్లి రాములు, పానుగంటి సతీశ్‌ నా వీడియోలు, ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి మన పరువు తీస్తున్నారు. ఇక్కడి ఏసీపీ సతీష్‌ కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ఇచ్చిన కేసును దర్యాప్తు చేయకుండా అన్నయ్యను, నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆత్మహత్యాయత్నంకు ఏసీపీ సతీష్, సాగర్, రాములు, పానుగంటి సతీష్‌లే కారణం, వీరిని అసలే వదలకండి" అని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిందుతులపై చర్య తీసుకోవాలని శ్రీవాణి బంధువులు మంచిర్యాల ఆస్పత్రి ముందు ఆందోళన దిగారు. డీసీపీ జాన్‌వెస్లీ వద్దకు చేరుకొని బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు.