లాగోస్, జూన్ 29 : నైజీరియాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. లాగోస్ పట్టణంలో ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఆయిల్ ట్యాంకర్ ప్రమాదానికి గురై ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా వ్యాపించి చుట్టూ ఉన్న వాహనాలను దగ్ధం చేశాయి. ఈ ఘటనలో 54వాహనాలు కాలి బూడిదయ్యాయి. అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఆయిల్ ట్యాంకర్ క్యాబిన్లో ఉన్న నలుగురితో పాటు బయట వాహనాల్లో ఉన్న మరికొందరు సజీవ దహనమయ్యారు. నైజీరియా ప్రభుత్వ ఎన్ఎన్పీసీ సంస్థకు చెందిన ఈ పైపు లైనును కొందరు వ్యక్తులు లాగోస్ శివారుల్లో ఉన్న అగ్బాబో గ్రామం వద్ద ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం సంభవించిందని నైజీరియా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సంఘటనలో సంబంధమున్న వారికోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.