రైలు నుండి 10 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్ల అదృశ్యం..

SMTV Desk 2018-06-28 18:23:46   Border Security Force (BSF) soldiers, 83 BSF jawans, bsf soldiers, mughalsarai

ముఘల్‌సరాయ్, జూన్ 28 ‌: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌)కు చెందిన పది మంది సైనికులు కనిపించకుండా పోయారు. 83 మంది సైనికులు ప్రత్యేక రైల్లో పశ్చిమ్‌బంగా‌లోని సాంబ జిల్లా నుంచి జమ్ముకు ప్రత్యేక రైల్లో ప్రయాణిస్తుండగా పది మంది అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. పశ్చిమ్‌బంగాలోని భర్ధమాన్‌ నుంచి బిహార్‌లోని ధన్‌బాద్‌ మధ్యలో వారు ఎక్కడో అదృశ్యమయ్యారని సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ జితేంద్ర కుమార్ యాదవ్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆ సైనికుల కమాండర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నగర్‌ రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ నగర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద కమాండర్‌ సైనికులకు హాజరు తీసుకోగా పది మంది అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని వెతికే పనిలో ఉన్నారని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.