డబ్లిన్, జూన్ 28 : టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐర్లాండ్తో బుధవారం జరిగిన తొలి టీ20లో భాగంగా రోహిత్ శర్మ (61 బంతుల్లో 97; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నా.. పదివేల పరుగుల మైలురాయి(10, 022 పరుగులు)ని అధిగమించాడు. తాజాగా అతడు పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. టెస్టు, వన్డే, టీ20.. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ సాధించిన పరుగులు 10,022. ఆఖరి ఓవర్ వరకు మైదానంలో ఉన్న రోహిత్ త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. భారత్ తరఫున సచిన్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, అజారుద్దీన్, సునీల్ గావస్కర్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్తో పాటు మరికొందరు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు సాధించారు. రోహిత్ శర్మ ఇప్పటి వరకు వన్డేల్లో 6,594, టెస్టుల్లో 1,479, టీ20ల్లో 1,949 పరుగులు సాధించాడు. షెడ్యూల్లో భాగంగా భారత్-ఐర్లాండ్ మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది. ఓవరాల్గా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పరుగుల జాబితాలో 34,357 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టులు (15,921), వన్డేల్లో (18,426) అత్యధిక పరుగుల రికార్డు సైతం సచిన్ పేరిటే ఉంది. సచిన్ తర్వాతి స్థానంలో కుమార సంగక్కర 28,016 పరుగులతో ఉన్నాడు.