హైదరాబాద్, జూన్ 25 : ముందస్తు ఎన్నికల సమరంకు ప్రతిపక్షాలు సిద్ధమా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్త అని.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని.. ఎన్నికలు డిసెంబర్ లేదా మే నెలలో ఎప్పుడొచ్చినా తాము ఉత్తమ్కుమార్ సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, విపక్షాల సంగతేమిటని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి వైదొలిగిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ.. "విపక్షాలు సరేనంటే ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం. దేశంలో ముందస్తు ఎన్నికలు రావొచ్చని నాకు అనుమానంగా ఉంది. అందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నట్లు మా పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలెప్పుడు జరిగినా వందకు పైగా స్థానాలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వే ద్వారా మరోసారి రుజువైంది. ఈ స్థానాల్లో 50% పైగా ఓట్లు మావే. ఒక్కో ఎమ్మెల్యేకు 60 వేల నుంచి 70 వేల మెజారిటీ వస్తుంది. విపక్షాలకు మాకు 40% తేడా ఉంది. అవన్నీ కలిసినా వారికీ ఓటమి తప్పదు" అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Whether it is May, 2019 or December, 2018 or TODAY, @INCTelangana is fully prepared and geared up to pull down TRS’ corrupt and insensitive regime. Early polls is good news for the people of Telangana as we can get rid of KCR a few months earlier. https://t.co/oPrqyfzg1q
— Uttam Kumar Reddy (@UttamTPCC) June 25, 2018