హైదరాబాద్, జూన్ 23 : జనసేన అధినేత, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విజయవాడలో అద్దె ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పెద్దకొడుకు అకీరా నందన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. పవన్, ఆయన భార్య అన్నా లెజినోవా, పవన్ కుమారుడు అకిరా కలిసి ఉన్న ఫొటో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫొటోను చూసి పవన్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. పవన్ కు తోడుగా.. ఆయన రాజకీయ వారసుడిగా అకీరా ఇక్కడే ఉండిపోతాడా..? అంటూ పలువురు నెటిజన్లు రేణూదేశాయ్కు మెసేజ్ చేస్తున్నారట. ఈ ప్రశ్నలకు విసిగిపోయిన రేణూ.. తన ట్విట్టర్ వేదికగా సమాధానం ఇచ్చారు. "అకీరా తన సెలవుల్లో కొన్ని రోజులు తండ్రితో కలిసి గడుపుతున్నాడు. అతడు హైదరాబాద్కు వచ్చేయలేదు. పవన్ తో కలిసి అకీరా విజయవాడలో ఉండటంతో నిన్నటి నుంచి నాకు విరామం లేకుండా సందేశాలు వస్తున్నాయి. వాటికి క్లారిటీ ఇవ్వడానికే ఈ ట్వీట్ చేస్తున్నా" అంటూ పోస్ట్ చేశారు. అకీరా ప్రస్తుతం పుణెలో చదువుకుంటున్నాడు.