ఓ యువకుడి తండ్రి పై దారుణ హత్య

SMTV Desk 2017-07-13 16:24:57  muzaffarnagar,boy,and,girl,alope,father,murderd,

ముజఫర్‌నగర్: జూలై 13: ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌ జిల్లా రసూల్ గ్రామానికి చెందిన షకీర్ కుమారుడు అబ్దుల్, రియాసత్ అనే వ్యక్తి కుమార్తె ఈ నెల 3 న ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. దీంతో రియాసత్ కుటుంబీకులు షకీర్ పై ఆగ్రహంతో ఉన్నారు. వారం గడిచి జాడ తెలియకపోవడంతో ఈ నెల 11 న షకిర్ ను అపహరించారు. బాలిక అదృశ్యానికి కారణమయ్యాడంటూ ఓ యువకుడిపై ఆగ్రాహంతో అతడి తండ్రిని దారుణంగా కొట్టి చంపారు. దీంతో మృతుని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో బందోబస్తు పటిష్టం చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రియాసత్ తో పాటు ఆరుగిపై వివిధ సెక‌్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరిసరాల్లో ఉన్న నింధితుల కోసం గాలింపు చేపట్టారు.