హైదరాబాద్, జూన్ 21 : సూపర్ స్టార్ మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ తన 25వ సినిమాలో ఓ కొత్త గెటప్ లో దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో అందరు ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను డెహ్రాడూన్ లో జరుపుతున్నారు. ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో మహేశ్ బాబు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా ట్రెండ్ అవుతున్నాయి. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో మహేష్ మీసం, గెడ్డంతో రఫ్ లుక్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన మహేష్ అభిమానులు తమ హీరో రఫ్ లుక్లో అదిరిపోయాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.