హైదరాబాద్, జూన్ 21 : టాలీవుడ్ టాప్ హీరోలందరితో జతకట్టిన అగ్ర కథానాయిక శ్రియా శరణ్.. ఇటీవల రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కోషీవ్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి విహారయాత్రలకు వెళ్ళిన ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. కాగా.. ప్రస్తుతం శ్రియ తన కొత్త సినిమాకు సంతకం చేశారు. శ్రియ, నిహారిక కొణిదెల కథానాయికలుగా ఓ చిత్రం చేయనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరైన శ్రియ.. పెళ్లి, పిల్లల గురించి మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఇప్పట్లో తల్లయ్యే ఆలోచనులు ఉన్నాయా.? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "ఇప్పుడిప్పుడే తల్లి అవ్వాలని అనుకోవడం లేదు. 20 వ సినిమా పూర్తయ్యేవరకు పిల్లల్ని కనకూడదని అనుకుంటున్నా. పెళ్లి నా సినీ కెరీర్కు అడ్డం కాదు" అంటూ చెప్పుకొచ్చింది.