నేరెళ్ల మృతిపై సంతాపం ప్రకటించిన కేసీఆర్‌..

SMTV Desk 2018-06-19 13:55:54  nerella venumadhav, kcr condolences to venu madhav, hyderabad, telangana

హైదరాబాద్, జూన్ 19 ‌: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, స్వరబ్రహ్మ నేరెళ్ల వేణుమాధవ్‌ మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా ఆయన మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. మిమిక్రీ కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిన వ్యక్తి నేరెళ్ల అని కొనియాడారు. మిమిక్రీ కళను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి... ఆ కళకు పితామహుడిగా ఖ్యాతి గడించారని అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.