అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం

SMTV Desk 2017-07-13 12:11:25  The, dead, body, of, a young, man, in, suspicion

హైదరాబాద్, జూలై 13 : ఇద్దరు యువకులు, అపస్మారక స్థితిలో మృతి చెందిన ఒక యువకుడిని మెడిసిస్ ఆసుపత్రికి తీసుకొచ్చిన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు యువకులు అర్దరాత్రి అపస్మారక స్థితిలో ఉన్న ఒక యువకుడిని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్దారించారు. అది విన్న ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ యువకుడి మృతి పై వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు నల్గొండ జిల్లాకు చెందిన శోభన్ గా గుర్తించారు. శోభన్ ను ఆసుపత్రికి తీసుకువచ్చిన యువకులు వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.