వైరల్ : మహిళను గుండెలపై తన్నిన ఎంపీపీ..

SMTV Desk 2018-06-17 13:47:12  land issue case, nizamabad mpp gopi,

హైదరాబాద్, జూన్ 17 : నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో స్థలం విక్రయం విషయంలో ఓ కుటుంబానికి, ఎంపీపీకి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఎంపీపీ ఇమ్మడి గోపీ ఓ మహిళను కాలితో ఆమె గుండెలపై తన్నాడు. ప్రస్తుతం ఈ గొడవ జిల్లాలో కలకలం రేపుంతోంది. విషయం ఏంటంటే.. స్థలం రిజిస్ట్రేషన్‌ తర్వాత ఎంపీపీ గోపీ అదనంగా డబ్బులు అడిగాడని బాధితురాలైన రాజవ్వ ప్రశ్నించింది. ఈ విషయమై ఎంపీపీ ఇంటిముందు ఆమె బంధువులతో సహా నిరసనకు దిగింది. ఈ ఘటనతో రాజవ్వకు, ఎంపీపీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రాజవ్వ ఎంపీపీని చెప్పుతో కొట్టగా.. కోపోద్రేక్తుడైన ఎంపీపీ గోపీ రాజవ్వ గుండెలపై తన్నాడు. ఆ వెంటనే ఆమె బంధువులు ఎంపీపీని అక్కడి నుంచి తోసివేశారు. ప్రస్తుతం ఈ ఘటన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి.