చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

SMTV Desk 2018-06-17 11:46:26  chitoor road accident, kuppam constancy, lorry accident.

చిత్తూరు, జూన్ 17 : కుప్పం నియోజకవర్గ సరిహద్దుల్లో శనివారం అర్ధరాత్రి ఓ ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయల లోడుతో వెళుతున్న లారీ పెద్దవంక సమీపానికి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. లోయలో పడి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని నాయనూరు నుంచి తమిళనాడులోని వానియంబాడికి మామిడికాయల లోడుతో లారీ శనివారం రాత్రి బయల్దేరింది. ఈ లారీలో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్నారు. అయితే అదంతా ఘాట్‌రోడ్డు కావడంతో ఆ లారీ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా మరో 20 మంది తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని వానియంబాడి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని మెరుగైన వైద్యం కోసం వేలూరుకు తరలించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ప్రమాద వివరాలను తెలసుకుని తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. బాధితులకు వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.