లూథియానా: జూలై 12 : పంజాబ్లో రాయ్ పూర్ గ్రామంలో ఓ మహిళతో మనీందర్ సింగ్ అక్రమ సమందం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం వేరే మహిళా కంటపడింది. అప్పటి నుంచి మనిందర్సింగ్ను ఆమె బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. పదేపదే బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతుండటంతో.. మనిందర్ సింగ్ సహించలేకపోయాడు. తన అక్రమ సంభందాన్ని ఇక్కడ బయటపెడుతుందో అన్న అనుమానతో ఓ మహిళను నడిరోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో విచక్షణారహితంగా గొడ్డలితో దాడి చేసి నరికిచంపాడు. హత్య తర్వాత రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాంతో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. పంజాబ్ లోని లూధియానాలో ఈ దారుణం జరిగింది. హత్యానంతరం మహిళ మృతదేహం పక్కనే నిందితుడు సెల్ఫీ వీడియో దిగడం గమనార్హం. ఈ ఘటన చోటు చేసుకోగా. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునారు. దర్యాప్తు కొనసాగుతోంది .హత్య చేసిన తర్వాత నిందితుడే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాడు.