హైదరాబాద్, జూన్ 12 : తనపై పదే పదే విపరీతంగా ఆరోపణలు చేస్తోన్న యువనటి శ్రీరెడ్డికి నేచురల్ స్టార్ నాని లీగల్ నోటీసులు పంపారు. ఈ విషయాన్ని నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. నిరాధారమైన ఆరోపణలతో శ్రీరెడ్డి తన పరువుకు భంగం కలిగిస్తోందంటూ తన న్యాయవాది ద్వారా నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టుకు సమాధానం ఇవ్వాలని నాని న్యాయవాదులు పేర్కొన్నారు. అంతేకాదు, ట్విటర్ వేదికగా ఓ నోట్ను కూడా నాని తన అభిమానులతో పంచుకున్నారు. "అసభ్యకరమైన వారు చేసే వ్యాఖ్యలకు నేను స్పందించను. ఒక్కో సమయంలో ఒక్కో వ్యక్తి లక్ష్యంగా నిరాధార ఆరోపణలు చేస్తూ నా నుంచి ఏదో పొందాలని నన్ను అదే పనిగా విసిగిస్తున్నారు. నాపై చేస్తున్న నిరాధార ఆరోపణలు నన్ను కలచివేశాయి. నిరాధార ఆరోపణలను క్లిక్ల కోసం కొందరు ప్రచురిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. వారికీ కుటుంబాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు" అని నాని పేర్కొన్నారు. నాని లీగల్ నోటీసులు పంపిన నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది. తాను కూడా చట్టపరంగానే పోరాడతానని ట్వీట్ చేసింది.
Patience has a limit. pic.twitter.com/9lJdr9kq2V
— Nani (@NameisNani) June 11, 2018