గద్వాల్, జూన్ 8 : ప్రస్తుతం ఎక్కడ చూసిన రోడ్డుల మీద వాహనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య చాలా ఘోరంగా తయారయింది. వాహనదారులు తమ వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్నారు. ఇక అలా చేస్తే జరిమానా తప్పదని గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ చంద్రమోహన్రావు స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారులపై రాంగ్ పార్కింగ్లో నిలిపిన వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధించారు. అంతే కాకుండా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలని, సురక్షితమైన ప్రయాణం చేయాలని సూచించారు. మైనర్ బాలలకు వాహనాలు అప్పగిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరికలు జారీచేశారు.