నాగపూర్, జూన్ 6 : మాజీ రాష్ట్రపతి, , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ కాసేపటి క్రితం నాగపూర్ చేరుకున్నారు. ఆయన రేపు అక్కడ జరగనున్న ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) వేడుకలో పాల్గోనున్నారు. తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన ఆయన గురువారం(ఆరెస్సెస్) నిర్వహించే ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లి ప్రసంగించనున్నారు. ఆరెస్సెస్ ప్రచారక్లుగా శిక్షణ పొందుతున్న వారికి ప్రణబ్ సూచనలు చేయనున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. తమ ఆహ్వానానికి ప్రణబ్ సమ్మతి తెలిపినట్టు ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ప్రణబ్ తన నిర్ణయాన్ని పునరాలోంచుకోవాలని కోరారు. అయితే కాంగ్రెస్కు బద్ధ శత్రువైన సంఘ్ ఆఫీస్కు వెళ్లి ప్రణబ్ ప్రసంగించడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఆరెస్సెస్ కార్యక్రమానికి వెళ్లొద్దని తనకు చాలా లేఖలు, ఫోన్లు వచ్చాయని.. అందులో ఏ ఒక్కదానికి స్పందించలేదని ప్రణబ్ముఖర్జీ చెప్పినట్టు బెంగాలీ పత్రిక ఆనందబజార్ వెల్లడించింది.